Mehreen Pirzada | నటి మెహరీన్కు కోపం వచ్చింది. తనను ట్రోల్ చేసిన వారిపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలే ఆమె ‘సుల్తాన్ ఆఫ్ దిల్ల్లీ’ అనే వెబ్సిరీస్లో నటించింది. ఇటీవలే స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్లో కథ డిమాండ్ చేయడం వల్ల కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. ఆ సీన్లు చూసిన కొందరు సోషల్ మీడియా వేదికగా మెహరీన్పై ఇబ్బందికరమైన కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. దీనిపై చాలా వరకూ సంయమనం పాటించింది మెహరీన్. అయినా అవి ఆగకపోవడంతో సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
‘నటన నా ఉద్యోగం. నేను ఓ బాధ్యతను తీసుకున్నప్పుడు దానిపై వందశాతం ఎఫర్ట్ పెట్టాలి. దానికోసం త్యాగాలు కూడా చేయాల్సిన పరిస్థితి. ‘సుల్తాన్ ఆఫ్ దిల్లీ’ అద్భుతమైన కథ. స్త్రీలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల్లో వైవాహిక అత్యాచారం ఒకటి. దాని వల్ల ఎందరో స్త్రీలు బాధపడుతున్నారు. ఆ నేపథ్యంలో సాగే కథ ‘సుల్తాన్ ఆఫ్ దిల్లీ’. అందులో దిల్లీ సుల్తాన్ క్రూరమైన అత్యాచారాన్ని దర్శకుడు తెరకెక్కించాడు. నేను ఆ సన్నివేశంలో నటించాను. కానీ కొందరు ఆ సన్నివేశంలోని బాధని చూడకుండా ట్రోలింగ్కి దిగారు. దాన్నొక శృంగార సన్నివేశంలా వాళ్లు చూడటం నిజంగా బాధాకరం. వాళ్లింట్లో కూడా ఆడవాళ్లుంటారు. అది మర్చిపోకూడదు’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు మెహరీన్.