అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని ఈరోజు మెగాస్టార్ చిరంజీవి కలువనున్నారు. ఏపీలో సినిమా టికెట్ల విషయంపై చర్చించనున్నారు. సినీ పరిశ్రమ, అధికార పార్టీ ప్రతినిధుల మధ్య టికెట్ల వివాదం రోజురోజుకూ ముదురుతున్న కారణంగా సీఎంతో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. టికెట్ల వ్యవహారమే కాకుండా ఇతర సమస్యలను కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఏపీలో సినిమా టికెట్ల తగ్గింపుతో రెండు నెలలుగా సినీ హీరోలు, నిర్మాతలు ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తుండడం, దానిని ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఘాట్గా స్పందిస్తుండడంతో ఇరు వర్గాల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ దశలో తాను పరిశ్రమకు పెద్దగా ఉండబోనని, సమస్యలపై స్పందిస్తానని ఇదివరకే ప్రకటించిన మెగాస్టార్ తొలిసారిగా సీఎం జగన్తో అమరావతిలోని తాడెపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11.30 భేటీ కానున్నారు.