Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి రెండోసారి కరోనా బారిన పడ్డారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ట్విట్టర్ వేదికగా చిరంజీవి వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని చిరు సూచించారు. త్వరలోనే మీ అందర్నీ కలుస్తాను అని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు.
2020, నవంబర్ 9వ తేదీన చిరంజీవి తొలిసారి కరోనా బారినపడ్డారు. ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్గా తేలిందని ఆయన అప్పట్లో ప్రకటించారు.
చిరంజీవి, రామ్చరణ్ నటించిన ఆచార్య సినిమాను ఉగాది కానుకగా ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేస్తున్నట్లు కొణిదెల ప్రొడక్షన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కొణిదెల ప్రొడక్షన్స్ విజ్ఞప్తి చేసింది. ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. దేశంలో ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండడంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు వాయిదా పడ్డాయి.