రీసెంట్గా 45ఏళ్ల కెరీర్ను పూర్తిచేసుకున్నారు మెగాస్టార్. నేటికీ తరగని ఇమేజ్తో అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నారాయన. ఈ ఏడాది చిరంజీవి చేసిన వాల్తేరు వీరయ్య, భోళాశంకర్ సినిమాలు కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్స్. అందుకే ఈ తరహా కథలకు కాస్త బ్రేక్నిచ్చి కొత్తగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు చిరు. అందులో భాగంగానే ‘బింబిసార’ఫేం వశిష్ట చెప్పిన కథకు పచ్చజెండా ఊపేశారు. ఇది పూర్తి భిన్నమైన కథ అని తెలుస్తున్నది.
జగదేకవీరుడు-అతిలోకసుందరి, అంజి తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆయన సోషియో ఫాంటసీ సినిమా చేయనున్నారు. కథ రీత్యా ఇందులో ముగ్గురు కథానాయికలు అవసరం. ఇప్పటికే అనుష్క, మృణాల్ ఠాకూర్ ఎంపికైనట్టు విశ్వసనీయ సమాచారం. కీలకమైన మరో కథానాయిక పాత్రకు గాను ఐశ్వర్యరాయ్ని సంప్రదించినట్టు తెలిసింది. మెగా అభిమానులకు ఇది నిజంగా ఆనందకరమైన వార్తే. మెగాస్టార్ సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు కామన్. ఇప్పుడు ఆయనతోపాటు ఐశ్వర్యరాయ్, అనుష్క, మృణాల్ ఠాకూర్ అంటే ఇక చెప్పేదేముంది? పండగేగా!