సీనియర్ కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘వాల్తేరు వీరయ్య’ విడుదల తేదీని ప్రకటించారు. జనవరి 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చిత్ర బృందం తాజాగా వెల్లడించింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ నాయికగా నటిస్తున్నది. మరో ముఖ్య పాత్రలో హీరో రవితేజ కనిపించనున్నారు.
దేవి శుపసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. వింటేజ్ చిరంజీవి ఇమేజ్ను గుర్తు చేసేలా పోర్ట్ ఏరియా బ్యాక్డ్రాప్లో పూర్తి కమర్షియల్ మూవీగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని జనవరి 12వ తేదీన విడుదల చేస్తామని తాజాగా ఆ చిత్రబృందం ప్రకటించింది. ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు వరుస తేదీల్లో విడుదలవడం సినీ ప్రియుల్లో ఆసక్తిని కలిగిస్తున్నది.