Megastar Chiranjeevi | ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో సంక్రాంతి సీజన్లో మంచి హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు అగ్ర నటుడు చిరంజీవి. ఆచార్య, గాడ్ఫాదర్తో తీవ్ర నిరాశ చెందిన చిరు.. మాస్ హిట్టు కోసం వేచి చూశాడు. ఈ నేపథ్యంలో దర్శకుడు బాబీ ‘వాల్తేరు వీరయ్య..’ రూపంలో బ్లాక్బస్టర్ హిట్ను అందించాడు. ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. దీంతో మెగా అభిమానులు ఈ సంక్రాంతికి మాస్ పండగను చేసుకున్నారు. చిరు సైతం సినిమా హిట్ అవ్వడం పట్ల సంతోషంగా ఉన్నాడట. ఇంత మంచి హిట్ ఇచ్చిన సందర్భంగా దర్శకుడు బాబీకి మెగాస్టార్ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చినట్లు ఓ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది.
వాల్తేరు వీరయ్య హిట్ అయిన సందర్భంగా బాబీని విందుకు ఆహ్వానించిన మెగాస్టార్.. అతడికి లగ్జరీ కారును కానుకగా ఇచ్చినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఆ కారు విలువు సుమారు రూ.రెండు కోట్ల మేర ఉంటుందని సమాచారం. అయితే ఇందులో నిజమెంతనేది తెలియదు కానీ, సోషల్ మీడియా, ఫిల్మ్ వర్గాలు, పలు వెబ్సైట్లలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. దీనిపై చిరు, బాబీ ఇప్పటి వరకు స్పందించలేదు కూడా.
యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో కనిపించారు. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చాడు.