కరోనా మహమ్మారికి గురై ఇటీవల మరణించిన వరుణ్ తేజ్ ఫ్యాన్స్ జిల్లా వరింగ్ ప్రెసిడెంట్ కనుకం శేఖర్ కుటుంబానికి మెగా హీరో వరుణ్తేజ్ అండగా నిలిచారు. శేఖర్ తల్లి కనుకం రాజేశ్వరికి హీరో వరుణ్ తేజ్ రూ. 2 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ను కరీంనగర్ జిల్లా మెగాఫ్యామిలీ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు వేల్పుల వెంకటేశ్ ద్వారా అందజేశారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెగాఫ్యామిలీ ఫ్యాన్స్ ముఖ్య అభిమానుల సమావేశం నగరంలోని ఒక ప్రముఖ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వేల్పుల వెంకటేశ్ మాట్లాడుతూ కరోనాతో మృతిచెందిన అభిమాని కుటుంబానికి అండగా నిలిచిన హీరో వరుణ్తేజ్కు కృతజ్ఞతలు తెలిపారు.