నరేశ్ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి కాండ్రేగుల ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘మాయలో’. మేఘా మిత్ర పేర్వార్ దర్శకత్వంలో షాలిని నంబు, రాధాకృష్ణ నంబు కలిసి నిర్మించారు. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుందని హీరో చెప్పారు. యువతరం మెచ్చే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయని జ్ఞానేశ్వరి అన్నారు. ‘యానిమల్’ తర్వాత ‘సలార్’కు ముందు మా సినిమా వస్తున్నదని,వయోలెన్స్ కాకుండా పువ్వులని, అమ్మాయిలని చూడాలనిస్తే డిసెంబర్ 15న మా సినిమాకు రావాలని భావన అన్నారు. వినోదం, భావోద్వేగాల సమ్మిళితం ఈ సినిమా అని దర్శకుడు చెప్పారు. ప్రేమతో నిర్మించిన చిత్రమిదని, అందరికీ తప్పక నచ్చుతుందని నిర్మాత నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా రాధాకృష్ణ నంబు కూడా మాట్లాడారు.