కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘అధర్వ’. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి మహేష్రెడ్డి దర్శకుడు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం టైటిల్ లోగో, మోషన్పోస్టర్ను కథానాయకుడు రవితేజ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే ఈ సినిమా కొత్త అనుభూతినిస్తుంది. కథ, కథనాలు ఉత్కంఠను పంచుతాయి. మలుపులు ఆకట్టుకుంటాయి. శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్గా వుంటుంది.’ అన్నారు.