Thiruveer | మసూద (Masooda) సినిమాతో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు తిరువీర్ (Thiruveer). ఈ యంగ్ హీరో ప్రస్తుతం పరేషాన్ సినిమాలో నటిస్తున్నాడు. రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తిరువీర్ ఇప్పుడు కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సారి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాను లైన్లో పెట్టాడు తిరువీర్.
ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుమార్ పనాస ఈ చిత్రంతో సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఏసియన్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని సమర్పించనుంది. జీ గోపీ విహారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేయబోతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. మరిన్ని వివరాలపై తిరువీర్ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటివరకు మాస్, ఎంటర్టైనింగ్, సస్పెన్స్ రోల్స్లో నటించిన తిరువీర్ ఈ సారి ఎలాంటి పీరియాడిక్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
పరేషాన్ చిత్రంలో పావని కర్ణన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బన్నీ అభిరామ్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, బద్దెర ఖాన్, రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. యశ్వంత్ నాగ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సిద్దార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.
Happy to be a part of this entertaining period drama produced by @ravipanasa garu.
Directed by @gopi_vihari garu
Presents by @AsianCinemas_ #NaranyanDasNarang Sir
Shoot starts soon.✨@SuhasiniHyma @GskMedia_PR pic.twitter.com/MrY8eLl7g2— Thiruveer (@iamThiruveeR) April 10, 2023
పరేషాన్ టీజర్..