హిందీ చిత్రసీమకు ఘన చరిత్ర ఉందని, ప్రస్తతం నడుస్తున్న దుర్దశ త్వరలో అంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్బాజ్పాయ్. ఇటీవల విడుదలైన అగ్రహీరోల చిత్రాలు లాల్సింగ్ చద్దా, రక్షాబంధన్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని సొంతం చేసుకున్నాయి. కరోనా అనంతరం బాలీవుడ్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నది. దీనిపై మనోజ్బాజ్పాయ్ స్పందిస్తూ ‘సినిమాకు తాత్కాలిక ఓటములే తప్ప శాశ్వతమైన ముగింపు అంటూ ఏమీ ఉండదు. బాలీవుడ్ సినిమా తిరిగి తన ప్రాభవాన్ని చాటుకుంటుంది. పాండమిక్ సమయంలో ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా మార్పులొచ్చా యి. ప్రస్తుతం ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలంటే కొత్త కథల్ని తయారుచేసుకోవాలి. ఎక్కడ తప్పు జరుగుతుందో గుర్తించి పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. మంచి కంటెంట్ మీద దృష్టి పెట్టి..ఓపికగా ఎదురుచూస్తే మళ్లీ విజయాల్ని అందుకుంటాం’ అన్నారు.