ముంబై : బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ బాయ్పేయి ఇంట్లో విషాదం అలుముకున్నది. ఆయన తల్లి గీతాదేవి (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా గీతా దేవి అనారోగ్యంతో బాధపడుతుండగా.. గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అశోక్ పండిట్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతుండగా.. ఢిల్లీలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమించగా తుదిశ్వాస విడిచారు.
మనోజ్ బాజ్పేయి గత వారం రోజులుగా ఢిల్లీలోని పుష్పాంజలి మెడికల్ సెంటర్ అండ్ మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో తల్లిని చేర్పించి వైద్యం అందిస్తున్నారు. కొద్ది సంవత్సరాల కిందటే మనోజ్ బాజ్పేయి తండ్రి మృతి చెందారు. తాజాగా ఆయన తల్లి సైతం మరణించడంతో కుటుంబంలో విషాదం అలుముకున్నది. పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు గీతాదేవి మృతికి సంతాపం ప్రకటించారు.