Manjima Mohan-goutham Karthik Wedding | కోలీవుడ్ యువ జంట గౌతమ్ కార్తిక్, మంజిమా మోహన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గతకొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్ధరూ సోమవారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటైయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో చెన్నైలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వీరి వివాహనికి సినీ పరిశ్రమ నుండి పలువురు సెలబ్రిటీలు హాజరై యువ దంపతులను అభినందించారు. మణిరత్నం, గౌతమ్మీనన్, వెంకట్ప్రభు, ఐశ్వర్య రజనీకాంత్, శివ కార్తికేయన్ వంటి స్టార్లు ఈ వేడుకకు వచ్చారు.
వీరిద్దరూ కలిసి 2019లో ‘దేవరత్తం’ అనే సినిమాలో కలసి నటించారు. అప్పటి నుండి వీళ్ళ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కాగా స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇటీవలే మంజిమా తన రిలేషన్ గురించి ఇన్స్టాగ్రామ్లో వెల్లడించింది. ప్రస్తుతం ఈమె ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’ అనే తెలుగు, తమిళ ద్విభాషా సినిమాలో నటిస్తుంది. ఇక ‘కడలి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన గౌతమ్ కార్తిక్ ప్రస్తుతం రెండు సినిమాలో బిజీగా ఉన్నాడు.
மகனையும் மருமகளையும் வாழ்த்திய Karthik | Gautham Karthik & Manjima Mohan Marriage Picture 📸#GauthamKarthik #ManjimaMohan #wedding #ssmusic pic.twitter.com/ObhTQXcJAM
— SS Music (@SSMusicTweet) November 28, 2022