షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రణ్ బీర్ సింగ్, రణ్ వీర్ సింగ్ వరుణ్ ధవన్, కత్రినాకైఫ్, శ్రీదేవి, మాధురీదీక్షిత్, కరీనాకపూర్, దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రాతో చాలా మంది బీటౌన్ (Bollywood) సెలబ్రిటీలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేశాడు మనీశ్ మల్హోత్రా (Manish Malhotra). బీటౌన్ ఫ్యాషన్ కలల ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన ఈ సెలబ్రిటీ కాస్ట్యూమ్ డిజైనర్కు సంబంధించిన వార్త ఇపుడు బీటౌన్లో హాట్ టాపిక్గా మారింది. మనీశ్ మల్హోత్రా ముంబైలో భారీ మొత్తానికి అపార్టుమెంట్ కొనుగోలు చేశాడట.
బాంద్రా వెస్ట్లోని భోజ్వనీ ఎన్క్లేవ్ (Bhojwani Enclave)సెకండ్ ఫ్లోర్ అపార్టుమెంట్ను రూ.21 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్టు బీటౌన్ వర్గాల సమాచారం. అపార్టుమెంట్ కోసం రూ.1.05 కోట్లు స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించాడని ఇన్ సైడ్ టాక్. ఈ అపార్టుమెంట్లో మూడు కారు పార్కింగ్ సౌకర్యం ఉంటుందట. మార్చి 10, 2022న డీడ్ రిజిస్టర్ అయినట్టు సమాచారం. మనీశ్ మల్హోత్రా ప్రస్తుతం అదే కాంప్లెక్స్ లో నివసిస్తున్నారు.