శివ కంఠమనేని, సంజన గల్రానీ, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మణి శంకర్’. ఈ చిత్రాన్ని లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణి భూషణ్ సంయుక్తంగా నిర్మించారు. జి. వెంకట్ కృష్ణన్ దర్శకుడు. హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ..‘డబ్బుతో ముడిపడిన ఓ సంఘటన నేపథ్యంతో సినిమా సాగుతుంది. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది.
జనవరి మొదటి వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు జి. వెంకట్ కృష్ణన్ మాట్లాడుతూ…‘ఈ కథలో హీరోలు, విలన్లు ఎవరూ ఉండరు. పరిస్థితులే అనుకూలంగా, ప్రతికూలంగా మారుతుంటాయి. నాయిక సంజన పాత్రలో అనేక కోణాలుంటాయి. జనవరిలో మంచి డేట్ చూసి రిలీజ్ చేస్తాం’ అన్నారు.