టాలీవుడ్ (Tollywood) హీరో శర్వానంద్ (Sharwanand) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu). కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే మాంగళ్యం తంతునానేనా సాంగ్ (Mangalyam Song Promo) ప్రోమోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం ఫుల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు.
కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఊర్వశి, ఖుష్బూ సుందర్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పెళ్లి సమయంలో ఉచ్చరించే మంత్రాలకు వెస్టర్న్ టచ్ ఇస్తూ శర్వానంద్ ఫ్రస్టేషన్తో సాగుతున్న ఈ పాట ఫన్నీగా సాగుతుంది. ఈ పెళ్లి గోల తట్టుకోవడం సాధ్యమా..? అంటూ శర్వానంద్ ఫ్రస్టేషన్ తో పాడుకుంటున్న ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటను దేవీ శ్రీప్రసాద్ (Devi Sri Prasad) కంపోజ్ చేయడమే కాదు..స్వయంగా రాశాడు.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా మార్చి 4న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.