పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మంగళవారం’. అజయ్భూపతి దర్శకుడు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మిస్తున్నారు. మంగళవారం టీజర్ను విడుదల చేశారు.
ఓ పచ్చటి పల్లెటూరు మధ్యలో దేవాలయం చుట్టూ జరిగిన సన్నివేశాలతో టీజర్ ఆద్యంతం ఉత్కంఠను పంచింది. దైవిక, హారర్ అంశాల కలబోతగా ఆసక్తిని రేకెత్తించింది. గొంగళి కప్పుకొని మంటల మధ్యలో కథానాయిక పాయల్ రాజ్పుత్ నిలబడటం, గట్టిగా అరుస్తూ ఆవేదన చెందడం కథపై మరింత ఉత్సుకతను పెంచేలా ఉంది. ఎన్నో సమాధానం లేని ప్రశ్నలకు అన్వేషణలా టీజర్ సాగింది.
దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో మన నేటివిటీని ప్రతిబింబిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. ఇదొక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. మొత్తం 30 పాత్రలుంటాయి’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, మాటలు: తాజుద్దీన్ సయ్యద్, సంగీతం: అజనీష్ లోక్నాథ్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: అజయ్ భూపతి.