Maa Elections | మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ కొత్త కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా బ్యాలెట్ వినియోగంపై రచ్చ జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని మంచు విష్ణు ప్యానెల్ దుర్వినియోగం చేస్తోందని ప్రకాశ్ రాజ్ మీడియా ముందు ఆరోపణలు చేశారు. ఆ తర్వాత కాసేపటికే మంచు విష్ణు కూడా ఒక ప్రకటన చేశారు.
తనకు, తన ప్యానెల్ సభ్యులకు ఈవీఎంలపై నమ్మకం లేదని విష్ణు కుండబద్దలు కొట్టారు. వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందంటూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్కు లేఖ రాశారు. ‘‘అక్టోబరు 10న మా ఎన్నికలు నిర్వహించే ఈవీఎంలపై మాకు నమ్మకం లేదు. వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది’’ అని విష్ణు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎన్నికలను పోస్టల్ బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు.