Manchu Manoj | టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్బాబు (Mohan Babu Manchu) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు మనోజ్ (Manchu Manoj). అయితే, జీవితంలో నెలకొన్న వ్యక్తిగత కారణాల వల్ల చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయినప్పటికీ తరచూ వార్తల్లో మాత్రం నిలుస్తూనే ఉన్నాడు. ఇందుకు కారణం తన రెండో పెళ్లి.
మంచు మనోజ్ (Manchu Manoj) 2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య నెలకొన్న విబేధాల కారణంగా వీరు 2019లో విడాకులు తీసుకుని ఎవరిదారి వారు చూసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న మనోజ్.. త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో (Tollywood Industry) ఇటీవలే తెగ ప్రచారం జరిగింది. భూమా మౌనిక రెడ్డి (Bhuma Mounika Reddy) తో మనోజ్ ఏడడుగులు వేయబోతున్నాడంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, ఈ వార్తపై ఇప్పటివరకూ ఇద్దరూ స్పందించలేదు.
అయితే, తాజాగా మార్చి మొదటివారంలో వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటికాబోతున్నారంటూ సోషల్ మీడియా, పలు వెబ్సైట్లలో వార్తలు వస్తున్నాయి. ఈ పెళ్లికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయట. మంచు- భూమా కుటుంబాలకు చెందిన అతి కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, మంచు మనోజ్ ప్రస్తుతం ‘అహం బ్రహ్మాస్మి’ టైటిల్తో సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. అహం బ్రహ్మాస్మి ఎప్పుడు విడుదలవుతుందని క్లారిటీ రావాల్సి ఉంది. దీంతోపాటు మరో కొత్త సినిమా What The Fishను మనోజ్ ఇటీవల ప్రకటించారు. మనం మనం బరంపురం.. అనేది క్యాప్షన్. డెబ్యూ డైరెక్టర్ వరుణ్ కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
మాజీ ఎంపీ, దివంగత రాజకీయ నేత భూమా నాగిరెడ్డి-శోభారాణి దంపతుల రెండో కుమార్తెనే ఈ భూమా మౌనికా రెడ్డి. వీరిది కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ. భూమా నాగిరెడ్డి-శోభారాణి దంపతులు ఏపీ రాజకీయాల్లో కీల పాత్ర పోషించారు. భూమా నాగిరెడ్డి మూడు సార్లు ఎంపీగా చేయగా.. శోభా నాగిరెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశారు. 2014లో శోభానాగిరెడ్డి మృతి చెందగా.. 2017లో భూమా నాగిరెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ దంపతులకు మొత్తం ముగ్గురు సంతానం. అఖిలప్రియ, మౌనికా రెడ్డి, జగత్విఖ్యాత్ రెడ్డి.
2016లో మౌనికా రెడ్డికి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త గణేష్ రెడ్డితో వివాహం అయ్యింది. 2018లో మౌనికారెడ్డి-గణేష్ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత రెండేండ్లకు మౌనికా రెడ్డి తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. కాగా, మంచు కుటుంబానికి భూమా కుటుంబానికి ముందు నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మౌనికా రెడ్డితో మంచు మనోజ్కు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ మంచి మిత్రులు. మౌనికా రెడ్డి వివాహానికి మనోజ్ కూడా హాజరై సందడి చేశారు. ఈ పరిచయంతోనే ప్రస్తుతం వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read..
CRED CEO Kunal Shah | తన నెల జీతం ఎంతో చెప్పిన క్రెడ్ సీఈవో.. తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Iran | ఇరాన్లో వందలాది మంది విద్యార్థినులపై విషప్రయోగం.. ఎందుకంటే..?
Twitter Lay Offs | ఉద్యోగులకు ఝలక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటించిన ట్విట్టర్..!
Ram Charan | రామ్ చరణ్పై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం.. ఆర్ఆర్ఆర్ నటుడి స్పందన ఇదీ..!