మంచు మనోజ్ ప్రయోక్తగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘ఉస్తాద్’. ‘ర్యాంప్ ఆడిద్దాం’ ఉపశీర్షిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ నెల 15 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ప్రోమోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ ‘ఏడేళ్ల విరామం తర్వాత ఈ టాక్షో ద్వారా ప్రేక్షకుల ముందుకురావడం ఆనందంగా ఉంది. ఈ షో కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఇదొక సెలబ్రిటీ గేమ్ షో. ఫ్యాన్స్ కోసం సెలబ్రిటీలు ఆడే ఆట ఇది. ఈ షోలో సెలబ్రిటీలు గెలుచుకున్న మొత్తాన్ని అభిమానికి అందజేస్తాం. ప్రైజ్ మనీ 50 లక్షలు, స్పెషల్ బహుమతులు కూడా ఉంటాయి. ‘ఉస్తాద్’ టాక్షో ద్వారా సరికొత్త ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అన్నారు. ఈ షోని మంచు మనోజ్ అద్భుతంగా ప్రజెంట్ చేశాడని సహనిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు.