Manchu Lakshmi | టాలీవుడ్ నటీమణి మంచు లక్ష్మి గురించి అసభ్యంగా మాట్లాడిన ఓ ఫ్యాన్పై ఆమె తీవ్ర స్థాయిలో స్పందించారు. తనను వెనుకనుండి టార్గెట్ చేస్తూ అసభ్యంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఆమె ఎదురుగా నిలబడమని ఛాలెంజ్ చేశారు. ఈ ఘటనకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే దుబాయ్ వేదికగా జరిగిన SIIMA 2025 అవార్డ్స్ వేడుకకి టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకలో మంచు లక్ష్మి కూడా పాల్గొన్నారు. సెలబ్రిటీలను దగ్గరగా చూసేందుకు, సెల్ఫీలు తీయడానికి అభిమానులు ఎగబడ్డారు. లక్ష్మి కూడా అభిమానుల్ని నిరాశపరచకుండా, వారితో సెల్ఫీలు దిగేందుకు ముందుకొచ్చారు.
అయితే అదే సమయంలో, ఆమె వెనకవైపు నిలబడి ఉన్న వ్యక్తి ఎవరో అసభ్యకరంగా కామెంట్ చేయడంతో, మంచు లక్ష్మి క్షణాల్లోనే ఆగ్రహంతో స్పందించారు. “ఒరేయ్! దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడురా. టైమ్, సెన్స్ ఏమీ లేదు రాస్కెల్స్!” అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మంచు లక్ష్మికి మద్దతు వెల్లువెత్తుతోంది. “ఇలాంటి అసభ్యకర కామెంట్లు మానుకోవాలి అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత కూడా మంచు లక్ష్మి మామూలుగా తన మూడ్కి వచ్చి, అక్కడి అభిమానులతో సెల్ఫీలు, జోకులు షేర్ చేసుకున్నారు.
“అక్కా, సెల్ఫీ ప్లీజ్” అంటూ మరికొంతమంది అడిగినపుడు వారికి మరింత ఆప్యాయతతో రెస్పాండ్ అయ్యారు. మంచు లక్ష్మీ మాట్లాడుతూ, “ముంబైలో కూడా తెలుగు ఫోటోగ్రాఫర్లు నన్ను ‘అక్కా’ అని పిలుస్తారు” అని చెప్పారు. ఓ చిన్నారి సెల్ఫీ అడిగినప్పుడు పేరు కూడా అడిగి, ప్రత్యేకంగా ఫోటో దిగారు. ఇక మంచు లక్ష్మీ కెరీర్ విషయానికి వస్తే.. గతేడాది ‘ఆదిపర్వం’ అనే చిత్రంలో నటించిన మంచు లక్ష్మి, జియో హాట్స్టార్ సిరీస్ ‘యక్షణి’లో కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమా పేరు ‘దక్ష: ది డెడ్లీ కాన్స్పిరసీ’. ఈ చిత్రాన్ని ఆమె స్వంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పైనే నిర్మిస్తున్నారు. మూవీ సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్కు మంచి స్పందన వచ్చింది. అంతేకాకుండా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ‘ది రైటర్స్ ఇండియా’ షోలో ఓ కంటెస్టెంట్గా కూడా పాల్గొన్నారు.