బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో ఏడో వారం చివరి దశకు చేరుకుంది. 19 మంది సభ్యులలో ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్ కాగా, నేడు మరొకరు హౌజ్ నుండి బయటకు వెళ్లనున్నారు. అయితే శనివారం కావడంతో నాగార్జున పుష్ప చిత్రంలోని శ్రీ వల్లి సాంగ్ తో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. అనంతరం మన టీవీ ద్వారా ఇంట్లోని ముచ్చట్లను చూపించారు.
ఈ వారం కెప్టెన్గా ఎంపికైన సన్నీ రేషన్ మేనేజర్గా కాజల్ని ఎంపిక చేశాడు. అనంతరం సరైన మ్యాచ్ను వెతకండి అనే టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఇందులో భాగంగా హౌస్లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ వారికి కాబోయే భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పాలని బిగ్ బాస్ చెప్పారు. దీంతో శ్రీరామ్.. తను చేసుకోబోయే అమ్మాయి బబ్లీగా ఉండాలని అన్నాడు. నమ్మంగా, నిజాయితీగా ఉండే అమ్మాయి తనకు కావాలని సన్నీ చెప్పాడు.
మానస్ మాట్లాడుతూ.. నేను ఎక్కువ అలుగుతాను, అప్పుడు తనే ముందుగా నన్ను బుజ్జగించాలి అని చెప్పాడు. అనంతరం ప్రియాంక మాట్లాడుతూ.. తనకి వచ్చేవాడు తనకంటే హైట్ ఉండాలని.. తన దగ్గర బోలెడంత ప్రేమఉంది కాబట్టి అది అతనికి ఇచ్చేస్తా అని చెప్తూ.. నా ఫ్యామిలీతో పాటు అబ్బాయి ఫ్యామిలీని కూడా చాలా బాగా చూసుకుంటా అని చెప్పింది.
ఇక షణ్ముఖ్ నా గార్ల్ ఫ్రెండ్ తననే చూడాలని చెప్పాడు. ఇలా పలువురు అభిప్రాయాలు షేర్ చేసుకోగా, అందరూ పింకీ-మానస్ను బెస్ట్ కపుల్గా పేర్కొన్నారు. దీంతో బిగ్ బాస్ వారిద్దరు పూలదండలు మార్చుకునేలా చేసి పెళ్లి జరిపించేశాడు. అనంతరం వీళ్లిద్దరూ ‘గువ్వా గోరికంతో..’ పాటకు జంటగా స్టెప్పులేశారు.