Avatar-2 Movie | ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన అవతార్-2 శుక్రవారం రిలీజై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ను చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా చూస్తూ ఆంధ్ర ప్రదేశ్లో ఓ వ్యక్తి మరణించాడు. కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీ రెడ్డి అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్ళాడు. సినిమా మధ్యలో శ్రీనుకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అక్కడే కూలిపోయాడు.
శ్రీను తమ్ముడు రాజు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఇలాగే అవతార్-1కు కూడా జరిగింది. తైవాన్లో 42 ఏళ్ళున్న ఒక వ్యక్తి ‘అవతార్’ సినిమా చూస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు. డాక్టర్లు ఆ వ్యక్తికి అధిక రక్తపోటు ఉన్నట్లు తెలిపారు. సినిమా చూస్తున్నప్పుడు ఓవర్ ఎగ్జైట్ అయ్యాడని, దానీ వల్ల ఆ వ్యక్తికి అధిక రక్తపోటు వచ్చిందని తెలిపాడు.
ఇక భారీ అంచనాల నడుమ రిలీజైన అవతార్-2 అంతే స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన హాలీవుడ్ మూవీగా సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగులో ఈ చిత్రం రూ.13 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది. దీని తర్వాత స్థానంలో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్(5.5 కోట్లు) ఉంది. టోటల్ వరల్డ్ వైడ్గా ఈ సినిమా దాదాపు రూ.1100 కోట్లు సాధించినట్లు సమాచారం.