మాలీవుడ్ సూపర్ స్టార్స్ మమ్ముట్టి,మోహన్ లాల్ యూఏఈ నుండి అరుదైన గౌరవం అందుకున్నారు. యుఏఈ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు నటులకు గౌరవప్రదమైన యూఏఈ గోల్డెన్ వీసా ప్రకటించింది. ఇది తొలి సారి కాగా, తమ హీరోలకు దక్కిన అరుదైన గౌరవం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలోబాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, సంజయ్ దత్లకు ఈ వీసాను ఇచ్చిన సంగతి తెలిసిందే. 2019లో యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాని ప్రవేశపెట్టగా, ఈ వీసా ఉన్నవారు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎలాంటి జాతీయ స్పాన్సర్స్ లేకుండానే 10 సంవత్సరాల పాటు అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు.
వీసా గడువు పూర్తి అయితే వెంటనే రెన్యువల్ చేస్తారు. అంటే త్వరలోఈ ఇద్దరు సూపర్ స్టార్స్ యూఏఈలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు.