Gaddar Awards | ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార ఆదేశించారు. శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేదర్ సచివాలయంలో జరిగిన గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు.
జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సాంసృతిక, విద్యా, సామాజిక ఔచిత్యం కలిగిన మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆవార్డులు అందజేస్తున్నట్లు ఆయన పేరొన్నారు. అవార్డుల కోసం లోగోతో సహా విధివిధానాలు, నియమ నిబంధనలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ..అవార్డుల ప్రదానోత్సవాన్ని జాతీయస్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలని సూచించారు. కల్చరల్ ఐకాన్ గద్దర్ ప్రతిష్ట పెంచేలా అవార్డుల లోగోలు రూపొందించాలని ఆయన కోరారు.
గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులు ఈ ఉగాది నుంచి ప్రతి సంవత్సరం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఫీచర్ ఫిల్మ్ లు, బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు వంటి వివిధ విభాగాల కింద అవార్డులు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. అవార్డులలో నగదు పురసారంతో పాటు ప్రశంసా పత్రం కూడా అందజేస్తారు. గద్దర్ అవార్డుకు సంబంధించి లోగోను కూడా రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, ఎండీ డాక్టర్ హరీశ్ , ఈడీ కిషోర్ బాబు, కమిటీ చైర్మన్ బీ నర్సింగ్ రావు, కమిటీ సభ్యులు జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ , హరీశ్ శంకర్ వందేమాతరం శ్రీనివాస్, గుమ్మడి వెన్నెల, అల్లాణి శ్రీధర్, వేణు తదితరులు పాల్గొన్నారు.