Malla Reddy Speech at Memu Famous Teaser Event | యూట్యూబ్ స్టార్ సుమంత్ ప్రభాస్ ‘మేము ఫేమస్’ అనే సినిమాతో హీరోగా డెబ్యూ ఇస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ను గ్రాండ్గా లాంచ్ చేశారు. కాగా ఈ వేడుకకు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చీఫ్ గెస్ట్గా వచ్చాడు. ఇక ఈ వేడుకలో మల్లారెడ్డి స్పీచ్ హైలైట్గా నిలిచింది. సినిమా గురించి, యూత్ గురించి పలు విషయాలను చెప్పి అందరిలోనూ జోష్ పెంచాడు. జూన్ 2న ఈ సినిమా మాములుగా ఆడదు. ఒక చరిత్ర సృష్టిస్తుంది అంటూ చిత్రయూనిట్లో జోష్ నింపాడు. ఇక హీరో సుమంత్ ప్రభాస్ను పొగడ్తలతో ముంచెత్తాడు.
ప్రభాస్ మేకప్ వేసుకుంటాడని, సుమంత్ మేకప్ వేసుకోకుండానే స్మార్ట్గా ఉంటాడని ఆకాశానికి ఎత్తేశాడు. సుమంత్ తెలంగాణ మోడల్ అని, రాబోయే రోజుల్లో దుమ్ము రేపుతాడని తెలిపాడు. చాయ్ బిస్కేట్ సంస్థ ఈ మధ్య మంచి మంచి సినిమాలను తెరకెక్కిస్తుందని కొనియాడాడు. ఫేమస్ అవ్వాలంటే కష్ట పడాలని, యూత్ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, లక్ష్యాన్ని పెట్టుకుని.. ఆ దిశగా ప్రయాణించాలని చెప్పుకొచ్చాడు. తన చాలా ఫేమస్ అయ్యాయని, తను ఇప్పుడు తను తుమ్మినా తుఫాన్ వస్తుందని తెలిపాడు. అయితే తను ఫేమస్ అవడం వెనుక చాలా కష్టం ఉందని, శ్రమ ఉందని వెల్లడించాడు. తనేం గొప్ప వ్యక్తి కాదని, సింపుల్ లివింగ్, లో ప్రొఫైల్, హై థింకింగ్ వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చాడు.
పవన్ సినిమాలో విలన్గా అడిగారు
ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో విలన్ క్యారెక్టర్ కోసం హరీష్ శంకర్ తనను సంప్రదించాడని మల్లారెడ్డి చెప్పుకొచ్చాడు. ఓ రోజు హరీష్ శంకర్ తన దగ్గరకి వచ్చి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యిపోయావు అన్నా. పవన్ కళ్యాణ్ తో నేను తీసే సినిమాలో విలన్ గా నటిస్తావా అన్నా అని హరీష్ శంకర్ గంటన్నర సేపు బ్రతిమిలాడాడని చెప్పాడు. కానీ తను విలన్గా నటించనని చెప్పినట్లు తెలిపాడు.