మలయాళంలో టీవీ ధారావాహికల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి అపర్ణా పి నాయర్ (31) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గురువారం సాయంత్రం తిరువనంతపురంలోని స్వగృహంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్మార్టం అనంతరం ఆమె మృతికి గల కారణాలను వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
మలయాళంలో ‘చందనమాల’ ‘ఆత్మసఖి’ ‘దేవస్పర్శమ్’ ‘మైథిలి వీన్డుమ్ ఓరుమ్’ వంటి పాపులర్ ధారావాహికలతో పాటు ‘మేఘతీర్థం’ ‘ఆచయన్స్’ ‘కల్కి’ వంటి చిత్రాల్లో అపర్ణా పి నాయర్ నటించారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన మనస్పర్థల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని సన్నిహితులు చెబుతున్నారు. అపర్ణా పి నాయర్కు ఇద్దరు పిల్లలున్నారు.