గోపీచంద్ కథానాయకుడిగా కన్నడ దర్శకుడు ఏ.హర్ష దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘భీమా’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. గోపీచంద్ పోలీసాఫీసర్పా పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో కథానాయికలుగా ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మలను ఖరారు చేశారు.
‘కథాగుణంగా ఇద్దరు నాయికలకు సమప్రాధాన్యం ఉంటుంది. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతున్నది. గోపీచంద్ కెరీర్లో విభిన్నమైన సినిమాగా నిలుస్తుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: స్వామి జె గౌడ, సంగీతం: రవి బస్రూర్, సంభాషణలు: అజ్జు మహంకాళి, దర్శకత్వం: ఎ.హర్ష.