అడివి శేష్ నటించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ మేజర్ కరోనా వలన వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా మేజర్ షూటింగ్ పూర్తి కాగా, తాజాగా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. సినిమా మేకింగ్కి సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేస్తూ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11, 2022న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్గా ‘మేజర్’ తెరకెక్కుతోంది. సందీప్ పాత్రను అడివి శేష్ చేస్తున్నారు. 120 రోజుల పాటు షూటింగ్ జరుపుకుని 8 సెట్లు, 75 లొకేషన్లు, 3 భాషల్లో సినిమా చిత్రీకరించారు. యువ వయస్సు నుండి ధైర్య సైనికుడిగా మారడం ను చూపించడం జరిగింది. ఈ వీడియో సినిమా పై భారీ అంచనాలను నెలకొల్పింది అని చెప్పాలి.
శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, శోభితా ధూళిపాళ మరియు సాయి మంజ్రేకర్ నటించిన బహుభాషా చిత్రం హిందీ, తెలుగు మరియు మలయాళంలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నాయి.