రీసెంట్గా విడుదలై సక్సెస్ఫుల్గా స్క్రీనింగ్ అవుతున్న సినిమాల్లో ఒకటి టాలీవుడ్ (Tollywood) హీరో అడివి శేష్ (Adivi Sesh) నటించిన మేజర్ (Major). 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ (Saimanjrekar) ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) డైరెక్ట్ చేసిన ఈ మూవీ టాక్ విషయంలోనే కాదు..కలెక్షన్ల పరంగా కూడా నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది.
తాజాగా నైజాం ఏరియాలో కలెక్షన్లకు సంబంధించిన ఓ వార్త ఇపుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం నైజాంలో మేజర్ ఆదివారం ఒక్కరోజు రూ.1.5 కోట్లు రాబట్టగా..నైజాంలో మొత్తం షేర్ రూ.4.8 కోట్లని సమాచారం. మరోవైపు తెలంగాణ, ఏపీలో మేజర్ చిత్రం ఆదివారం రూ.3.2 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. వీకెండ్లో కలెక్షన్లు బాగానే ఉన్నాయి. వీక్ డేస్ కూడా మొదలయ్యాయి.
మరి వీక్ డేస్లో కూడా మేజర్ కలెక్షన్ల విషయంలో దూకుడు ప్రదర్శిస్తాడా..అన్నది చూడాలంటున్నారు ట్రేడ్ పండితులు. సోనీ పిక్చర్స్ ఇండియా, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ సంయుక్తంగా మేజర్ చిత్రాన్ని నిర్మించగా..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. మేజర్ తెలుగు, హిందీతోపాటు పలు భాషల్లో థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది.