SSMB 29 | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu) ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 28 సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరకారం టైటిల్తో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా.. ఇప్పుడిక మహేశ్ బాబు- ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 (ssmb29) అప్డేట్స్ పై ఆరాతీయడం మొదలుపెట్టారు సినీ జనాలు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ క్రేజీ సినిమా వార్త ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం 2024 ఉగాది తర్వాత సినిమా షురూ కానుందని, త్వరలోనే దీనిపై అధికారిక అప్డేట్ వస్తుందని ఓ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఇదే నిజమైతే మహేశ్ బాబు అభిమానులకు ఇక బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రాబోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ న్యూస్ తెలిసిన మూవీ లవర్స్ ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు.
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అంతర్జాతీయ ప్రేక్షకులకు థియేటర్లలో తెలుగు సినిమాలు చూసేలా చేసే పొటెన్షియాలిటీ SSMB29కి మాత్రమే ఉందని నిర్మాత శోభుయార్లగడ్డ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తున్నాయి. ఎస్ఎస్ఎంబీ 29లో మహేశ్ బాబు రోల్ లార్డ్హనుమాన్ స్ఫూర్తిగా జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగనుందని నెట్టింట ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఎస్ఎస్ఎంబీ 29 ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా రాబోతుందని సమాచారం.
కథానుగుణంగా ఎస్ఎస్ఎంబీ 29లో అగ్రభాగం అమెజాన్ ఫారెస్ట్లో చిత్రీకరించబడుతుందని ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉంటే గుంటూరు కారం మాస్ స్ట్రైక్ అభిమానులకు మహేశ్ బాబు కావాల్సిన ఫుల్ మీల్స్ అందివ్వబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేస్తుంది. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..
As of now only @ssrajamouli’s #SSMB29 has potential to drag international audience to watch telugu movies in theatres – @Shobu_ ❤️🔥
MOST ANTICIPATED FILM OF INDIAN CINEMA 😎 pic.twitter.com/TqnxIurIEM
— VardhanDHFM (@_VardhanDHFM_) November 26, 2023