Major Movie | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాలలో ‘మేజర్’ ఒకటి. ముంబై బాంబు దాడుల్లో అమరవీరుడైన మేజర్ సందీప్ ఉన్నీ కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సందీప్ పాత్రలో అడవిశేష్ నటించాడు. ఈ చిత్రానికి ‘గూడాఛారి’ ఫేం శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించాడు. మొదటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు నుంచి ఇటీవలే విడుదలైన ట్రైలర్ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుతూనే ఉన్నాయి.ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లను ప్రారంభించింది.
ఈ చిత్రానికి మహేష్బాబు నిర్మాత వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా మేజర్ టిక్కెట్ కోసం మహేష్ బాబు క్యూలో నిలబడ్డాడు. హీరో శేష్, యూట్యూబర్ నిహారికతో కలిసి ఒక వీడియోను రూపొందించారు. ఈ వీడియోలో నిహారిక మేజర్ టిక్కెట్ల కోసం లైన్లో నిలబడుతుంది. అంతలో క్యూ మధ్యలోకి వచ్చిన అడివిశేష్తో గొడవపడుతుంది. ఆ తర్వాత క్యూ లైన్లోకి వచ్చిన మహేష్ను చూసి ఆశ్చర్యపోతుంది. మహేష్ను నెంబర్ అడిగేలోపు వెళ్ళిపోతాడు. ఇలా ఫన్నీగా వీడియో సాగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇటీవలే వైజాగ్లో మేజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సినిమా ప్రివ్యూ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం అనేది ఇండియాలో ఇదే మొదటి సారి.
జీఎంబీ ఎంటర్టైనమెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఎయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. శోభితా ధూళిపాల కీలకపాత్రలో నటించింది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Queues are so much fun with @AdiviSesh and @urstrulyMahesh 🙂#MajorTheFilm #MajorOnJune3rd #Adivisesh #MaheshBabu𓃵 pic.twitter.com/lsUk0tRs9F
— Niharika Nm (@JustNiharikaNm) May 29, 2022