ఏ తల్లిదండ్రులకైన తమ పిల్లలు ప్రయోజకులైతే ఎంత సంతోషంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ ఫీలింగ్ లో మహేష్ దంపతులు ఉన్నారు. మహేష్ , నమ్రతలకు గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉండగా, వారు సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వకుండా స్టార్ స్టేటస్ సంపాదించారు. గౌతమ్ ఘట్టమనేని మహేశ్ హీరోగా నటించిన ‘1 నెకొక్కడినే’లో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా, ఇందులో గౌతమ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి . ఈ క్రమంలో మహేష్, నమ్రత చాలా సంతోషించారు.
తాజాగా మరోసారి తన తల్లిదండ్రులు గర్వపడేలా చేశాడు గౌతమ్. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీలో టాప్ 8 ఈతగాళ్ల లిస్ట్లో స్థానం సంపాదించాడు గౌతమ్. 15 ఏళ్ల వయసులోనే ఆయన ఈ ఘనత సాధించగా, కొడుకు సాధించిన విషయాన్ని గర్వంగా చెప్పుకొచ్చింది నమ్రత . గౌతమ్ నీళ్లలో 5 కిలో మీటర్ల దూరాన్ని 3 గంటల్లో ఈదగలడని చెప్పుకొచ్చిన నమ్రత.. గౌతమ్ బటర్ఫ్లై, బ్యాక్స్ట్రోక్, బ్రెస్ట్స్ట్రోక్ , ఫ్రీస్టైల్ అనే నాలుగు పద్ధతుల్లో ఈత కొడతాడని, అతనికి ఫ్రీస్టైల్ అంటే బాగా ఇష్టమని చెప్పింది.
ఇవి కూడా చదవండి..