మన హీరోలు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఓ కన్ను బిజినెస్లపై పెడుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో మహేష్ బాబు అలాగే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ వంటి హీరోలు ఎక్కువ వ్యాపారం మీద దృష్టి సారిస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ మధ్యకాలంలో వ్యాపారాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. మహేష్ బాబు ఇప్పటికే పలు వ్యాపారాలు చేస్తుండగా, మరో కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడని ప్రచారం కూడా టాలీవుడ్ వర్గాల్లో మొదలైంది.
తెలుగు లో ఆన్ లైన్ విద్యా బోధన కోసం కొత్త యాప్ ని తీసుకు వచ్చే ప్రయత్నం మహేష్ బాబు చేస్తున్నాడని దీనికి సంబంధించి ఒక మల్టీ నేషనల్ కంపెనీ తో చర్చలు జరుపుతున్నాడని దీంట్లో మహేష్ బాబు దాదాపు వంద కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని అంటున్నారు. మహేష్ నటిస్తున్నసర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్.. జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల మీద నవీన్ యెర్నేని, వై.రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 1కి విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఇందులో మహేష్ స్టైలీష్ లుక్లో కనిపించబోతున్నారు.