చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్కు ప్రేక్షకుల్లో ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అగ్ర హీరో మహేష్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబో అలాంటిదే. వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ చిత్రం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఆగస్ట్లో సెట్స్మీదకు వెళ్లనుంది. ఈ సందర్భంగా శనివారం ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎవర్గ్రీన్ కాంబినేషన్ తాలూకు పూర్వ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఆగస్ట్లో చిత్రీకరణ మొదలుపెడతాం. వేసవిలో విడుదల చేస్తాం’ అని చిత్ర బృందం పేర్కొంది. ‘అతడు’ ‘ఖలేజా’ వంటి వినూత్న చిత్రాల తర్వాత మహేష్బాబు-త్రివిక్రమ్ కలయికలో రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పూజాహెగ్డే కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్ , ఎడిటర్: నవీన్నూలి, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, రచన-దర్శకత్వం: త్రివిక్రమ్.