మహేష్బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయి హంగులతో ఈ ప్రాజెక్ట్కు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా కథాంశం గురించి రాజమౌళి స్పందించారు. హాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా భావించే గవర్నర్స్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన మహేష్బాబుతో రూపొందించే సినిమా విశేషాల్ని వెల్లడించారు. ‘ఈ చిత్రం కోసం నాన్న విజయేంద్రప్రసాద్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. కొన్ని నెలల క్రితమే కథా రచన మొదలుపెట్టారు.
‘ఇండియానా జోన్స్’ నాకు ఇష్టమైన సినిమా. ఆ తరహాలో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మహేష్బాబుతో తీయబోయే సినిమా కూడా అదే శైలిని పోలిన అడ్వెంచరస్ థ్రిల్లర్’ అని చెప్పారు. ట్రెజర్ హంట్ నేపథ్యంలో వచ్చిన ‘ఇండియానా జోన్స్’ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. ట్రెజర్ హంట్ (నిధి అన్వేషణ) నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్లర్ అంశాలతో ఈ సిరీస్ చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.