మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. మే 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ‘ఇప్పటికే విడుదలైన ‘కళావతి..’, ‘పెన్ని..’ పాటలు శ్రోతల్ని అలరిస్తున్నాయి. సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. ‘బ్యాలెన్స్గా ఉన్న పాటను త్వరలో తెరకెక్కిస్తాం. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. బడా బాబుల బ్యాంకు మోసాలు, వాటి వల్ల రైతులు పడే కష్టాల్ని చర్చిస్తూ వాణిజ్య పంథాలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.మది, సంగీతం: తమన్, నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, రచన, దర్శకత్వం: పరశురాం పెట్ల.