మహేష్ బాబు(Mahesh Babu) మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండే రికార్డుల వేట మొదలవుతూ ఉంటుంది. ఆయన సినిమా సెట్స్ పైకి వెళ్లి ఆ సినిమా నుండి ఏదైన అప్డేట్ వచ్చిందంటే ఇక రికార్డులని వేట మొదలవుతూనే ఉంటుంది. ప్రస్తుతం మహేష్.. పరశురాం(Parasuram) దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది.
ఈ చిత్రం నుంచి ఎంతో కాలంగా ఎదురు చూస్తూ వచ్చిన టీజర్ ను చిత్ర యూనిట్ మహేష్ బర్త్ డే కి బ్లాస్టర్ పేరిట రిలీజ్ చెయ్యగా దీనికి భారీ స్పాన్స్ వచ్చింది. మొట్టమొదటి 1 మిలియన్ లైక్డ్ రీజనల్ టీజర్ గా రికార్డు సెట్ చేసి భారీ వ్యూస్ ని కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ టీజర్ మరో మైల్ స్టోనో సాధించింది. 40 మిలియన్ వ్యూస్ అందుకొని సాలిడ్ రికార్డు సెట్ చేసింది. ఈ ఫీట పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.