మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ను మొదలుపెట్టారు. ప్రస్తుతం యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. భారీ సంఖ్యలో ఫైటర్స్ పాల్గొనగా హై ఇంటెన్సిటీ యాక్షన్ ఎపిసోడ్ను తెరకెక్కిస్తున్నారని చెబుతున్నారు.
సినిమాకు ఈ ఎపిసోడ్ హైలైట్గా నిలుస్తుందని, మహేష్బాబు సరికొత్త యాక్షన్ మోడ్లో కనిపిస్తారని అంటున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నది. తమన్ సంగీతాన్నందిస్తున్నారు.