మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఇటీవల విడుదల చేసిన పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమా తుదిదశ చిత్రీకరణలో ఉంది. హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో నాయకానాయికలపై రొమాంటిక్ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు.
మరో రెండు రోజుల్లో ఈ పాట చిత్రీకరణను పూర్తి చేయబోతున్నారు. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లేనని చిత్రబృందం తెలిపింది. శ్రీలీల, మీనాక్షి చౌదరి, ప్రకాష్రాజ్, బ్రహ్మానందం, జగపతిబాబు, జయరాం తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది.