Guntur Kaaram | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీలా ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం (Guntur Kaaram). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘కుర్చీ మడతపెట్టి..’ పాట పర్ఫెక్ట్ మాస్ నంబర్గా ఆకట్టుకుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రిన్స్ టీం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 6న హైదరాబాద్లో నిర్వహించనున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రీ రిలీజ్ వేడుకను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో భారీ ఎత్తున నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. దీనికోసం పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. అయితే సడన్గా ఈ ఈవెంట్కు భద్రతా సమస్యల కారణంగా పర్మిషన్ రద్దు చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడిస్తూ.. మేము ఎంత ప్రయత్నించినప్పటికీ ఊహించని పరిస్థితులు, భద్రతా సమస్యల కారణంగా.. గుంటూరు కారం ప్రీ రిలీజ్ వేడుకను కాన్సిల్ చేస్తున్నాం. కొత్త
తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అంటూ మేకర్స్ రాసుకోచ్చారు.
GUNTUR KAARAM – PRE RELEASE EVENT POSTPONED!
“Despite our best efforts, due to unforeseen circumstances and issues with security permissions, we will not be conducting the highly awaited #GunturKaaram Pre-release event on 6th January 2024. We sincerely apologize for this… pic.twitter.com/TGExYQnrWe
— BA Raju’s Team (@baraju_SuperHit) January 5, 2024