Mahesh Babu | సాధారణంగా మహేశ్ బాబు చాలా కూల్గా కనిపిస్తాడు.. స్టేజీ ఎక్కిన తర్వాత కూడా కంపోజ్డ్గా ఉంటాడు. ఎమోషనల్ అయినట్లు ఎప్పుడూ కనిపించడు కూడా. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా చాలావరకు బయటపడడు.. లోపలే కవర్ చేసుకుంటాడు సూపర్ స్టార్. కానీ కెరీర్లో తొలిసారి చాలా ఎమోషనల్ అయినట్లు కనిపించాడు మహేశ్ బాబు. సర్కారు వారి పాట ( Sarkaru Vaari Paata ) ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేశ్ బాబు ఎందుకో కానీ కొత్తగా కనిపించాడు. ఈవెంట్ మొత్తం చాలా సైలెంట్గా ఉన్నాడు.. ఇక మైక్ తీసుకున్న తర్వాత ఎంతో ఎమోషనల్గా మాట్లాడాడు. బహుశా రెండేళ్ల నుంచి అభిమానులను ఇంటరాక్షన్ లేకపోవడం కారణంగానో ఏమో మరి.. చాలా ఎమోషనల్ అయ్యాడు సూపర్ స్టార్.
ఇన్నాళ్లూ దాచి పెట్టుకున్న మాటలన్నీ ఒకేసారి స్టేజ్పై మాట్లాడేశాడు. ముఖ్యంగా రెండేళ్లలో తనకు నచ్చిన వాళ్లు కొందరు దూరమయ్యారని.. వాళ్లు లేని బాధ తీర్చలేనిదంటూ దాదాపు ఏడ్చినంత పని చేశాడు మహేశ్. ఆయన మాటల్లో తడి కూడా అర్థమవుతుంది. అంతగా ఎమోషనల్ అవ్వడానికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎంతగానో అభిమానించే అన్నయ్య రమేశ్ బాబు ఈ మధ్యే మరణించాడు. ఆయన చనిపోయినపుడు మహేశ్ బాబుకు కరోనా వచ్చింది. దాంతో అన్నయ్య చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయాడు సూపర్ స్టార్. అలాగే గతేడాది తనతో ఎంతో ఆప్యాయంగా ఉండి.. చిన్నపుడు తనను ఎత్తుకుని ఆడించిన బీఏ రాజు కూడా చనిపోయాడు. ఆయన పోయినపుడు కూడా మహేశ్ బాబు చాలా ఎమోషనల్ అయ్యాడు.
ఈ ఇద్దరూ మహేశ్ బాబు జీవితంలో ప్రత్యేక పాత్ర పోషించారు. తన కెరీర్కు ఎంతగానో అండగా నిలిచిన బీఏ రాజు, రమేశ్ బాబు మరణాన్ని తలుచుకుని బాధ పడ్డాడు మహేశ్ బాబు. ఎవరున్నా లేకపోయినా మీరున్నారనే ధైర్యం మాత్రం తనకెప్పుడు ఉంటుందని మహేశ్ చెప్పడంతో అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు. ఏదేమైనా మహేశ్ స్పీచ్ తర్వాత సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ వేదిక అంతా ఓ రకమైన భావోద్వేగమయమైంది.
“Parasuram | ‘నేను విన్నాను..నేనున్నాను..’ డైలాగ్ సీక్రెట్ అదేనట”
Sekhar Master | మహేశ్ బాబు డ్యాన్స్కు 100 మార్కులు వేస్తా: శేఖర్ మాస్టర్”
టికెట్ రేట్ల విషయంలో సర్కారు వారి పాట టీమ్ సంచలన నిర్ణయం..?”