మూవీ లవర్స్ ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్న సినిమాల్లో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ఒకటి. టాలీవుడ్ డైరెక్టర్ పరశురాం (Parasuram), మహేశ్ బాబు (Mahesh babu) కాంబినేషన్లో వస్తోంది. టాలెంటెడ్ బ్యూటీ కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం మే 12న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్లో మహేశ్ మార్కు డైలాగ్స్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాయి. ట్రైలర్ షురూ అయినప్పటి నుంచి ముగిసే వరకు మహేశ్ స్టైల్లో చెప్పే సంభాషణలు సినిమాకు హైలెట్గా నిలువబోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే ట్రైలర్ మధ్యలో మహేశ్ హీరోయిన్ కీర్తిసురేశ్ చేతిలో చేయి వేసి..నేను విన్నాను..నేనున్నాను (nenu vinnanu nenu vunnanu dialogue) అంటూ చెప్పే డైలాగ్ చాలా కొత్తగా ఉందంటున్నారు మూవీ లవర్స్. అది సరే గాని ఈ డైలాగ్ కొత్తదేమి కాదు..చాలా పాపులారిటీ తెచ్చుకున్న సంభాషణ అది. ఈ డైలాగ్ రాయడం వెనుకున్న సీక్రెట్ ఏంటో చెప్పాడు పరశురాం.తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాడిన..ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్ వాడుతున్న పాపులర్ డైలాగ్ను ఓ సీన్కు రాశానని చెప్పాడు.
‘నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమానిని. ఆయనకు మాస్ ఫాలోయింగ్ బాగా ఉంటుంది. నాకు ఆయన హీరోలాగే అనిపిస్తుంది. ‘నేను విన్నాను..నేను ఉన్నాను..’అనే ఒక్క మాటతో ప్రజలకు భరోసానిచ్చేశారు. సీఎం జగన్ కూడా ఆ స్లోగన్ను కంటిన్యూ చేస్తున్నారు. అచ్చు అలానే కీర్తిసురేశ్కు మహేశ్ బాబు భరోసా ఇవ్వాల్సి ఉండగా..ఆ సన్నివేశంలో ఈ డైలాగ్ సరిగ్గా సరిపోతుందని పెట్టినట్టు’ చెప్పాడు పరశురాం.