Businessman | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన మాస్ స్ట్రైక్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. కాగా మహేశ్బాబు కెరీర్లో స్పెషల్ సినిమాగా నిలిచిన బిజినెస్మేన్ (Businessman) రీరిలీజ్ కానుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం రీరిలీజ్కు ముందే వార్తల్లోకి ఎక్కి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. బిజినెస్మేన్ ఆగస్టు 9న విడుదల కానుండగా.. హైదరాబాద్లో టికెట్స్ అడ్వాన్స్ సేల్స్ విషయంలో అరుదైన ఫీట్ నమోదు చేసింది.
తాజా టాక్ ప్రకారం అడ్వాన్స్ సేల్స్ రూ. కోటి దాటినట్టు సమాచారం. దీంతో పూరీ జగన్నాథ్-మహేశ్ బాబు కాంబోలో వచ్చిన ఈ చిత్రం హైదరాబాద్లో అత్యంత వేగంగా కోటి రూపాయల మార్క్ దాటిన మొదటి రీరిలీజ్ సినిమాగా నిలిచింది. మహేశ్ బాబు క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ఈ ఒక్క అప్డేట్ చెబుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నాజర్, షాయాజీ షిండే, ప్రకాశ్ రాజ్, రజా మురద్, సుబ్బరాజు, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్ఆర్ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు.
ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మీనాక్షి చౌదరి మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ ఫ్యాన్స్ కు కావాల్సిన వినోదాన్ని అందిస్తోంది. గుంటూరు కారం నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ కోసం హైదరాబాద్లో రెండు భారీ సెట్స్ వేసినట్టు ఇప్పటికే ఓ వార్త తెరపైకి వచ్చింది. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.
అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. గుంటూరు కారం 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సినిమా సెట్స్పై ఉండగానే మహేశ్ బాబు త్వరలోనే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న ఎస్ఎస్ఎంబీ 29ను కూడా లాంఛ్ చేయనున్నట్టు వార్తలు రాగా.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..