‘ఆర్ఆర్ఆర్’ చిత్రం సాధించిన అపూర్వ విజయంతో ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉన్నారు దర్శకుడు రాజమౌళి. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. మహేష్బాబు కథానాయకుడిగా ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ స్థాయి హంగులతో యూనివర్సల్ కథాంశంతో రాజమౌళి ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లనుందని ప్రచారం జరిగింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా మరింత ఆలస్యం కానున్నట్లు తెలిసింది. 2024లోనే ఈ చిత్రం పట్టాలెక్కుతుందని అంటున్నారు. అంతర్జాతీయ స్థాయి హంగులతో నిర్మించనున్న ఈ సినిమా కోసం ప్రఖ్యాత హాలీవుడ్ నిపుణులు పనిచేయబోతున్నారని చెబుతున్నారు. బిజినెస్పరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్టూడియోలతో రాజమౌళి సంప్రదింపులు జరుపుతున్నాడని తెలిసింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ డేట్స్ సర్దుబాటు కావడంతో పాటు పూర్వ నిర్మాణ పనులకు దాదాపు ఏడాది సమ యం తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి-మహేష్బాబు చిత్రం 2024లోనే సెట్స్మీదకు వెళ్తుందని సమాచారం.