మాధవ్ భూపతిరాజు (రవితేజ సోదరుడు రఘు కుమారుడు) కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రానికి ‘ఏయ్..పిల్లా’ అనే టైటిల్ను ఖరారు చేశారు. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ ప్రూబల్ షికావత్ కథానాయికగా నటిస్తున్నది. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘1990 నేపథ్యంలో వింటేజ్ ప్రేమకథగా తెరకెక్కించబోతున్నాం. హృదయాన్ని స్పృశించే అంశాలున్న అందమైన ప్రేమకథా చిత్రమిది’ అని చెప్పారు.
రమేష్వర్మ కథనందిస్తున్న ఈ చిత్రానికి సంభాషణలు: అన్వర్, ఛాయాగ్రహణం: శ్యామ్ కె నాయుడు, సంగీతం: మిక్కీ జే మేయర్, ఎడిటర్: ప్రసన్న, ఆర్ట్: చిన్నా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: గణేష్ ముప్పానేని, దర్శకత్వం: లుధీర్ బైరెడ్డి.