అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. . గత మూడు నెలల క్రితం ‘మా’ అధ్యక్షుడిగా గెలుపొందిన తరువాత ఏపీ సీఎంను కలవడం ఇదే తొలిసారి . ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశంతో పాటు సినీ రంగ సమస్యలపై చర్చించారు.
వారం రోజుల క్రితం చిరంజీవి బృందం సీఎం జగన్ను కలిసి సినీ సమస్యలపై చర్చించిన విషయం తెలిసిందే. సినీ సమస్యల పరిష్కారంపై మూడోవారంలో ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందని చిరంజీవి బృందం సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎంను కలిసిన వారిలో ప్రముఖ సినీ నటులు ప్రభాష్, మహేశ్, అలీ, ఆర్.నారాయణ మూర్తి, దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ తదితరులు ఉన్నారు.