ఆసక్తికరమైన సీరియల్స్తో తెలుగువారిని ఆకట్టుకుంటున్న జీ తెలుగులో మరో అందమైన డైలీ సీరియల్ ప్రసారం కానుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం, మానవ విలువలకు పట్టం కట్టే కథతో రూపొందుతున్న సరికొత్త సీరియల్ ‘మా అన్నయ్య’.
ఈ సీరియల్తో మైత్రీ మూవీ మేకర్స్ బుల్లితెరకు పరిచయం అవుతుండటం విశేషం. ఈ నెల 25న సీరియల్ ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు ఇది ప్రసారం కానుంది. అనూహ్యమైన మలుపులతో తీర్చిదిద్దుతున్న ‘మా అన్నయ్య’ తెలుగు ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని జీ తెలుగు యాజమాన్యం పేర్కొన్నది.