న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సోకిన వారికి వైద్య సాయం అందిస్తున్న ‘శ్రీ గురుతేగ్ బహదూర్ కొవిడ్ కేర్ సెంటర్’కు బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ రూ. 2 కోట్ల విరాళమందించారు. ఢిల్లీలోని రకబ్ గంజ్ గురుద్వారాను కొవిడ్ కేర్ కేంద్రంగా మార్చారు. ఈ విషయాన్ని ఢిల్లీ సిక్కు గురుద్వార నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మన్జీందర్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.