నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రలలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉన్నప్పటికీ కరోనా వలన వాయిదా పడింది. వినాయక చవితికి వస్తుందని అన్నారు.కాని పలు కారణాల వలన వాయిదా పడింది. ఈ నెల 24న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేస్తూ వచ్చాం. ఇన్ని రోజులు సరైన సమయం కోసం వేచి చూశాం. ఆ శుభతరుణం రానే వచ్చింది. థియేటర్లలో సినిమాను అందరూ ఆస్వాదించండి’ అన్నారు శేఖర్ కమ్ముల.
శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై కె. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు లవ్ స్టోరీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మరి కొద్ది రోజులలో విడుదల కానుండగా, ప్రమోషన్ స్పీడ్ పెంచారు. సెప్టెంబర్ 11 ఉదయం 11.07ని.లకు ట్రైలర్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ట్రైలర్తో సినిమాపై అంచనాలు పెరగడం ఖాయంగా కనిపిస్తుంది..
లవ్ స్టోరీ సినిమాలోని ‘సారంగదరియా…’ పాట ఆల్టైమ్ రికార్డులు సృష్టించింది. సున్నితమైన భావోద్వేగాలతో సాగే అందమైన ప్రేమకథా చిత్రంగా ఇది రూపొందగా,ఇందులో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని తదితరులు నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నారు.